
మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. దాంతో ఈ సినిమా బయటకు రావడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. దాంతో మహేష్ బాబు ఓల్డ్ ఫోటోలు, రేర్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో మరోసారి షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు త్రో బ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట తెగ షికారు చేస్తుంది. పై ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన క్యూట్ స్మైల్ తో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా. ? ఆ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యింది ఈ పాప. మొదట టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయిందీ ముద్దుగుమ్మ.
అలాగే ఫ్యాషన్ బ్లాగర్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కొన్ని ప్రకటనల్లోనూ నటించింది. ఈ అమ్మడి క్యూట్ నెస్ కు ఫిదా అయిన దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఒక చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన ఒక సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో మరోసారి ఈ సొగసరి పేరు నెట్టింట మార్మోగిపోతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఛాన్స్ అందుకుంది. మరి ఈ క్యూటీని గుర్తు పట్టారా? ఆమె ఎవరో కాదు తెలుగమ్మాయి రమ్య పసుపులేటి. మొన్నామధ్య మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.
రమ్య పసుపులేటి చిన్నతనంలోనే యాడ్స్ లో నటించడం మొదలు పెట్టింది. ఇదే క్రమంలో అనుష్క నటించిన పంచాక్షరిలో బాల నటిగా నటించింది. అలాగే మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీలోనూ ఓ చిన్న రోల్ పోషించింది. పై ఫొటో ఆ మూవీ సెట్ లో తీసుకున్నదేనేమో.. హుషారు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సిరితో కలిసి బీఎఫ్ఎఫ్ అనే వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేసింది. ఇక రీసెంట్ గా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో కథానాయికగా నటించింది. ఇందులో రమ్య నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మెగాస్టార్ విశ్వంభర సినిమాలో చిరు చెల్లెలిగా కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.