-
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా చిత్ర బృందమంతా మళ్ళీ కలిసింది. 'బాహుబలి' రీ యూనియన్ పార్టీ గ్రాండ్ గా జరిగింది.
-
'బాహుబలి: ది బిగినింగ్' జూలై 10, 2015న విడుదలైంది. బాక్సాపీస్ వద్ద కనివినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో 'బాహుబలి' సినిమా 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి చిత్ర బృందం కదిలి వచ్చింది.
-
దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి, నాసర్, సత్యరాజ్, రమ్య కృష్ణన్ తో పాు ఈ చిత్రంలో నటించిన అనేక మంది ప్రముఖ నటులు, టెక్నీ షియన్లు ఈ రీయూనియన్ పార్టీలో సందడి చేశారు.
-
అలాగే ఈ విజువల్ వండర్ ను తీర్చిదిద్దిన అనేక మంది సాంకేతిక నిపుణులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కెమెరామెన్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
-
ఇక బాహుబలి సినిమా కోసం రాత్రింబవళ్లు శ్రమించిన రాజమౌళి భార్య రమా రాజమౌళి, రాజమౌళి కోడలు శ్రీవల్లి ఈ వేడుకకు హాజరయ్యారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా తళుక్కుమన్నాడు. అయితే హీరోయిన్లు అనుష్క, తమన్నా మాత్రం రాలేదు.
-
కాగా బాహుబలి రెండు చిత్రాలను కలిపి ఒకే చిత్రంగా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ లో బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.