
హీరో మహేష్బాబుకు ED నోటీసులు జారీచేసింది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో.. 28న విచారణకు రావాలంటూ మహేష్కు నోటీసులు పంపారు. ప్రమోషన్ కింద రూ. 3.4 కోట్లు తీసుకున్నట్టు గుర్తించిన ఈడీ. ఈనెల 16న ED హైదరాబాద్ సోదాలు చేసింది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ ఆఫీసులతోపాటు, ఈ సంస్థల అధినేతల ఇళ్లపై ED దాడులు చేసింది .ఆ తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా మహేష్ ఈనెల 28న ఉదయం 10. 30 నిమిషాలకు హైదరాబాద్ లోని ఈడి హెడ్ క్వార్టర్స్ కి రావాలని నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ యాడ్ కోసం మహేష్ బాబు మొత్తం 5 కోట్ల 90 లక్షలు తీసుకున్నట్టు గుర్తించారు. రూ. 3.4 కోట్లు చెక్, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో మహేష్ తీసుకున్నట్టు గుర్తించారు. సాయి సూర్య డెవలపర్ ఎండీ సతీష్ చంద్ర ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చింది ఈ విషయం. మహేష్ బాబు భార్య పిల్లలతో కలిసి సాయిసూర్య డెవలపర్స్ యాడ్ లో నటించాడు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.