
ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో త్రిప్తి డిమ్రీ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈరోజు ఆమె సినీపరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఉనికిని నిలుపుకున్న హీరోయిన్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ మూవీలో చిన్న పాత్రలో కనిపించిన త్రిప్తి.. ఆ తర్వాత ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. యానిమల్ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబోలో రానున్న స్పిరిట్ చిత్రంలో కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో త్రిప్తి డిమ్రీ ఒకరు. నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. ఇక త్రిప్తికి ఆటో మొబైల్స్ అంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇటీవలే బ్లూకలర్ పోర్స్చే 911 కారెరా కారును కొనుగోలు చేసింది. ఆటో మొబైల్స్ పోర్టల్స్ ప్రకారం ఈ కారు ధర రూ.2.11 కోట్లు. ఇక త్రిప్తి దగ్గర ఈ కారు కాకుండా రేంజ్ రోవర్ స్పోర్ట్, రెనాల్డ్ డస్టర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే.. అన్వితా దత్ తెరకెక్కించిన బుల్బుల్ (2020)సినిమాతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఖాలా మూవీలో కనిపించింది. ఇక 2023లో విడుదలైన యానిమల్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఇటీవలే బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా 3 వంటి చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీలో సెలక్ట్ అయ్యింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..