
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సీన్ సీన్ కు ఊహించని మలుపులతో ఆద్యంతం సినీప్రియులను ఆశ్చర్యపరుస్తాయి. అందుకే ఈమధ్యకాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి క్షణం ట్వి్స్టులతో సాగే చిత్రాలకు ఇప్పుడు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దాదాపు 12 ఏళ్లుగా ఓటీటీ ప్రపంచాన్ని ఏలేస్తుంది. దాదాపు 2 గంటల 36 నిమిషాలు ఊహించని మలుపులతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అంతేకాదు.. ఈ సినిమా కథ, యాక్టింగ్, క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ఐఎండీబీలో 8.2 రేటింగ్ కలిగి ఉంది. ఈ చిత్రాన్ని అనేక భాషలలోకి రీమేక్ చేశారు. హత్య గురించి సాగే మిస్టరీ.. చివరి వరకు బయటపడని నిజం.. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. అదే దృశ్యం.
దాదాపు 2 గంటల 36 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా చివరి వరకు ప్రేక్షకులను స్క్రీన్ కు అతుక్కుపోయేలా చేస్తుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ సైతం రిలీజ్ చేశారు. 2013లో మలయాళంలో రూపొందించిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ కథ, దర్శకత్వ బాధ్యాతలు తీసుకున్నారు. ఇందులో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయగా.. వెంకటేశ్, మీనా నటించారు. ఇక హిందీలో అజయ్ దేవగన్, టబు జంటగా నటించారు. మోహన్ లాల్ నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. బాక్సాఫీస్ రూ.50 కోట్ల కలెక్షన్ మార్క్ దాటిన తొలి మలయాళ సినిమాగా రికార్డ్ సృష్టించింది.
కథ విషయానికి వస్తే.. రాంబాబు అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుర్లతో కలిసి ప్రశాంతమైన జీవితం సాగిస్తుంటారు. ఒక ఐజీ కొడుకు అనుహ్యంగా అదృష్టమవడంతో రాంబాబు జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారు. చివరకు రాంబాబు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాడు.. ? ఆ ఐజీ కొడుకు ఏమయ్యాడు? అనేది సినిమా. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..