
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు వేసవి సెలవులు… వీకెండ్ రావడంతో మరిన్ని చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. పెద్ద స్టార్ హీరో సినిమాలు కాకుండా కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలకు సైతం పట్టం కడుతున్నారు. ఈమధ్య కాలంలో రొమాంటిక్ చిత్రాలు దూసుకుపోతున్నారు. ఇప్పుడు అలాంటి చిత్రాల్లో పాంచాలి ఒకటి. ఇదొక రొమాంటిక్ డ్రామా.ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి అసలు చూడలేరు. ఐదుగురు భర్తలు ఉన్న స్త్రీ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఐదుగురు అన్నాదమ్ములు.. అందరూ ఒకే స్త్రీని వివాహం చేసుకుంటారు. వీరి జీవితం ఎంతో ప్రశాంతంగా సాగుతుంది.
2019లో వచ్చిన ఈ తమిళ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ అనుప్రియ గోయెంకా ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో ఆమె నటిగా ప్రశంసలు అందుకుంది. సుమారు గంట 40 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉన్న ఈ పాంచాలి చిత్రం ఇప్పుడు ఉల్లు ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.
కథ విషయానికి వస్తే.. నలుగురు అన్నదమ్ములు ఒకే స్త్రీని (భూమి) వివాహం చేసుకుంటారు. సిటిలో ఉండే తమ తమ్ముడిని సైతం తమ భార్యనే వివాహం చేసుకోవాలని కండిషన్ పెడతారు. అందుకు అతడు అంగీకరించడు. అయితే ఒకరోజు తమ ఇంట్లో పూజ గదిలోని దేవుడి విగ్రహం నుంచి రక్తం రావడాన్ని గమనిస్తారు. దీంతో తమ తమ్ముడు భూమిని పెళ్లి చేసుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందని అంటారు. చివరకు ఏం జరిగింది.. ? తన మరిదిని భూమి ఐదో భర్తగా పెళ్లి చేసుకుందా ? అనేది సినిమా.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..