
మంచు మనోజ్ కు మంచు విష్ణుకు మధ్య జరుగుతున్న వివాదాల గురించి తెలిసిందే.. మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుతో జరుగుతున్న కుటుంబ వివాదాల నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో మాట్లాడారు. మనోజ్ మాట్లాడుతూ.. “వెళ్లి నాన్న కాళ్ళు పట్టుకోవాలని, నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది. కానీ, చేయని తప్పుని అంగీకరిస్తే..? నా పిల్లలకు నేనేం నేర్పిస్తా. మా నాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకెళ్లలేకపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా. సమస్యలు సృష్టించిన వారు తమ తప్పుని తెలుసుకుంటారనే నమ్మకం ఉంది.” అని అన్నారు మనోజ్.
మనోజ్ చేసిన ఈ కామెంట్స్మం తన తండ్రి పట్ల గౌరవం, ప్రేమను కలిగి ఉన్నప్పటికీ, కుటుంబంలో జరుగుతున్న విభేదాల కారణంగా ఆయన మనసు ఎంతబాధపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ వివాదాలు ఆస్తి తగాదాలు కాదని, ఆత్మగౌరవం, నీతి సంబంధిత విషయాలపై తన పోరాటం అని మనోజ్ గతంలోనూ స్పష్టం చేశారు. ఆయన తన తండ్రి నేర్పిన నీతి విలువలను పాటిస్తూ, చేయని తప్పు విషయంలో క్షమాపణ చెప్పలేనని, అలా చేస్తే తన పిల్లలకు తప్పుడు సందేశం వెళ్తుందని మనోజ్ అన్నారు.
అలాగే మనోజ్ తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలని, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన నటించిన భైరవం సినిమా విడుదల కానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కలిసి నటిస్తున్నారు. మే 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాతో మంచి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని అయన అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.