
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. బ్యా్క్ టూ బ్యాక్ వరుస హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది ఈ అమ్మడు. బిడ్డ పుట్టిన తర్వాత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న దీపికా.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో ఈ అమ్మడు నటించనున్నట్లు ప్రచారం నడిచింది. కానీ కొన్ని కారణాలతో ఆమెను తప్పించి దీపికా స్థానంలోకి త్రిప్తి డిమ్రిని తీసుకున్నారని టాక్. ఇక నిన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన సంచలన ట్వీట్ తో మరోసారి దీపికా పేరు తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా దీపికా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో తెగ వైరలవుతున్నాయి. ఎప్పుడూ తన మనసు చెప్పేదే వింటానని అన్నారు దీపికా. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా.. అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యమని.. దానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటానని.. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటానని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి.
గత రెండు రోజులుగా ఈ అమ్మడు పేరు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీపికాకు సంబంధించిన పీఆర్ టీం స్పిరిట్ సినిమా స్టోరీని లీక్ చేసిందంటూ ప్రచారం నడిచింది. అందుకే డైరెక్టర్ సందీప్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇస్తూ నిన్న ట్వీట్ చేసినట్లుగా అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్. ఈ క్రమంలో ఇప్పుడు దీపికా మాట్లాడిన మాటలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..