
స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడితో రిలేషన్ లో ఉందంటూ గతకొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్ రాజ్ నిడిమోరుల ఎదో ఉంది అంటూ చాలా రోజులుగా ఇటు ఇండస్ట్రీలో అటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ మధ్య ఈ ఇద్దరూ కలిసి కనిపించడం. సమంత కూడా రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటోలు పంచుకోవడంతో చాల మంది ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేశాయి. ఆమె చేసిన కామెంట్స్ తో ఈ ఇద్దరి మధ్య డేటింగ్ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇంతకూ ఆ నటి ఎవరు ఆమె చేసిన కామెంట్స్ ఏంటంటే..
సమంత ఇటీవల నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. సమంత నిర్మాతగా చేసిన సినిమా శుభం. కామెడీ హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో శుభం సినిమాలో నటించిన సీనియర్ నటి మధుమణి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. సమంత పై ప్రశంసలు కురిపించారు. నేను 39ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను ఎంతో మంది హీరో హీరోయిన్స్ కు తల్లిగా నటించాను.. . 3 నంది అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్నా.. దాదాపు 400 సినిమాలు చేశాను. అయితే సమంతతో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. రంగస్థలం సినిమాలో అవకాశం వచ్చినా అది మిస్ అయ్యింది. ఇన్నాళ్లకు ఆమె సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది అని అన్నారు.
అలాగే శుభం సినిమాలో ఛాన్స్ రాగానే హ్యాపీగా ఫీల్ అయ్యా.. ఒక్క రోజు షూటింగ్ చేయగానే చికెన్ గన్యా వచ్చింది.. ఛాన్స్ మిస్ అవుతుందేమో అని భయపడ్డా కానీ అదృష్టంకొద్దీ నాలుగు నెలల తర్వాత మళ్లీ ‘శుభం’తో ప్రయాణం మొదలైంది. సమంత అందరిని ఎంతో బాగా చూసుకున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సామ్ కు శుభం. రాజ్, సమంత శుభంతో ఈ జర్నీ మొదలు పెట్టారు. శుభంగానే ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి..శతమానం భవతి అంటూ ఆశీర్వదించారు. దాంతో అంత షాక్ అయ్యారు. సమంత, రాజ్ల రిలేషన్ ను మదుమణి దాదాపు కన్ఫర్మ్ చేశారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.