-
అయేషా ఖాన్ తెలుగు, హిందీ చిత్రాలతో పాపులర్ అయ్యింది. ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ సోదరుడు షహబాజ్ ఖాన్ ఇండియన్ మర్చంట్ నేవీలో అధికారి. ఈ అమ్మడు తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది.
-
అయేషా 2020లో ఏక్తా కపూర్ యొక్క డైలీ సోప్ కసౌతీ జిందగీ కేలో జూనియర్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించింది. 2019లో బాలవీర్ రిటర్న్స్ షోలో బిర్బా పాత్రలో నటించి గుర్తింపు పొందింది.
-
2022లో తెలుగు చిత్రం ముఖచిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఓం భీమ్ బుష్లో ఆమె గ్లామరస్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది.
-
2023లో హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో కంటెస్టెంట్గా పాల్గొని, స్టార్డమ్ను సంపాదించింది. ఈ షో ఆమెను దేశవ్యాప్తంగా గుర్తించేలా చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఈ బ్యూటీ సిజ్లింగ్ డ్యాన్స్ రీల్స్ ద్వారా సోషల్ మీడియా సంచలనంగా మారింది,
-
అయేషా ముంబైలో నివసిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఈ బ్యూటీ తన ఫ్యాషన్, డ్యాన్స్ వీడియోలతో అభిమానులను ఆకర్షిస్తుంది. తాజాగా చీరకట్టులోనూ ఓ బ్యూటీ నటించి మెప్పిస్తుంది.