Most Recent

ఆన్ పబ్లిక్ డిమాండ్..! రాధికను ఆటాడుకున్న మహేష్ బాబు.. సోషల్ మీడియాలో రచ్చ

ఆన్ పబ్లిక్ డిమాండ్..! రాధికను ఆటాడుకున్న మహేష్ బాబు.. సోషల్ మీడియాలో రచ్చ

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు. చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అభిమానులకు కావాల్సినంత కిక్ ఇవ్వలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. నిజానికి గుంటూరు కారం సినిమాను మహేష్ బాబు ఒక్కడే నడిపించాడు. ఆయన స్టైల్, డైలాగ్స్, డాన్స్, కామెడీ టైమింగ్ అన్ని ఆకట్టుకున్న సినిమా మాత్రం అంత కిక్ ఇవ్వలేకపోయింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది. గుంటూరు కారం సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

ఇందుకోసం మహేష్ బాబును బయట కనిపించకూడదని  కండిషన్ పెట్టారట జక్కన్న. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం మహేష్ బాబు రగడ లుక్ లో కనిపిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆయనకు సంబందించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవలే ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మహేష్ బాబును డీజే టిల్లుగా మార్చారు కొందరు అభిమానులు.

ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ వాడకం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఏఐను ఉపయోగించి చాలా మంది సెలబ్రెటీల వాయిస్ టైహో పాటలను క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఫేస్ మార్ఫింగ్ కూడా చేస్తున్నారు. మొన్నామధ్య డీజే టిల్లు సినిమాలోని అపార్ట్ మెంట్ సీన్ కు మహేష్ బాబు ఫేస్ ను వాయిస్ ను ఉపయోగించి వీడియో చేశారు. ఇప్పుడు అదే సినిమాలో మరోస్ సీన్ ను కెరియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. స్మశానం లో హీరోకు హీరోయిన్ కు మధ్య జరిగే ఫన్నీ కన్వర్జేషన్ ను మహేష్ బాబుతో ఎడిట్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

 మహేష్ బాబు వీడియో..

 

View this post on Instagram

 

A post shared by roasterbidda (@roaster_bidda)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.