

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలలో బిజీగా ఉన్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్.. మంచి ఫాలోయింగ్ అందుకుంది. తెలుగులో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన రాశీ.. తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత జయం రవి సరసన అడంగు మరు చిత్రం, అయోగ్య, అరణ్మణై 3, తిరుచిట్రం ఫలం, సర్దార్ వంటి చిత్రాల్లో మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటిగా ఎదుగుతోంది. ఇటీవలే ఓ భేటీలో ప్రేమకథా చిత్రాల గురంచి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేసేది ప్రేమ కథా చిత్రాలకే అని పేర్కొంది. అలాంటి సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవని తెలిపింది. ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేసేది ప్రేమ కథా చిత్రాలకే అని పేర్కొంది. అలాంటి సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవని తెలిపింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అలాగే గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. హాట్ హాట్ ఫొటోలతో ఫిదా చేస్తుంది ఈ భామ.
తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఐఐఎఫ్ఏ అవార్డుల వేడుకలో మెరిసింది రాశిఖన్నా.. ఈ ముద్దుగుమ్మ కాస్ట్యూమ్స్ మాత్రం ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ఒంపు సోంపులతో కట్టిపడేసింది రాశి. ప్రస్తుతం యోదా అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందాల ఆరబోతలో డోస్ పెంచేసింది.
View this post on Instagram