Most Recent

Tollywood : ఏడాదికే ప్రియుడికి బ్రేకప్ చెప్పిన హీరోయిన్.. మరొకరితో డేటింగే కారణమా.. ?

Tollywood : ఏడాదికే ప్రియుడికి బ్రేకప్ చెప్పిన హీరోయిన్.. మరొకరితో డేటింగే కారణమా.. ?

భారతీయ సినిమా ప్రపంచంలో అత్యధిక రికార్డులు కొల్లగొట్టిన మూవీ దంగల్. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీతో చాలా మంది నటీనటులు గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో సన్యా మల్హోత్రా ఒకరు. ఇందులో బబితా కుమారి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు, షోలు, ఓటీటీ సిరీస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తతుం ఆమె హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే ఆమె నటించిన చిత్రాలు ఎక్కువగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇదివరకు ఆమె నటించిన సన్నీ సంస్కారీ కి తులసి కుమారి, బేబీ జాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌ వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. సన్యా మల్హోత్రా తన ప్రియుడు రిషబ్ రిఖిరామ్ శర్మతో బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరు ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఏడాది కాలంగా సన్యా మల్హోత్రా ప్రముఖ సితార్ ప్లేయర్ రిషబ్ రిఖిరామ్ తో ప్రేమలో ఉన్నారు. చాలా సార్లు ఈ జంట పలు వేడుకలలో కలిసి సందడి చేసింది. అయితే రిలేషన్ షిప్, బ్రేకప్ గురించి వీరిద్దరు స్పందించలేదు. కానీ ఇద్దరు సంవత్సర కాలంలోనే తమ బంధానికి ముగింపు పలికారు. ఇందుకు కారణం… రిషబ్ మరొకరితో డేటింగ్ లో ఉన్నట్లు అని తెలుస్తోంది. అందుకే సన్య అతడికి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. గతంలోనూ సన్యాకు బ్రేకప్ జరిగినట్లు తెలిపింది. నాలుగేళ్ల ప్రేమాయణం తర్వాత బ్రేకప్ జరిగిందని చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

ప్రస్తుతం సన్యా మల్హోత్రా సినిమాలతో బిజీగా ఉంటుంది. మరోవైపు రిషబ్ రిఖిరామ్ విషయానికి వస్తే… అతడు రిఖిరామ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రముఖ సితార్ ప్లేయర్. అలాగే స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. ఇదివరకే 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra (@sanyamalhotra_)

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.