Most Recent

Rashmi Gautam: కొన్ని సీక్రెట్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉంది.. రష్మీ ఆసక్తికర పోస్ట్

Rashmi Gautam: కొన్ని సీక్రెట్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉంది.. రష్మీ ఆసక్తికర పోస్ట్

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు ఎక్కువగా బుల్లితెరకే పరిమితమైందీ అందాల తార. కాగా టాలీవుడ్ బుల్లితెరకు సంబంధించి పెళ్లి కానీ ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ పేరు కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది టీవీ షోలతో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు మూగజతువులంటే రష్మీకి ఎంతో ప్రేమ. మూగజీవుల గురించి, వాటి సంరక్షణ గురించి కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది.

ఇక రష్మీ గౌతమ్ తన టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సొషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా రష్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇండియా, పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అలాగే రష్మీ కూడా ఆపరేషన్ సిందూర్ పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

యుద్ధ సమయంలో శత్రువును కీర్తించడం.. సొంత నాయకుడిని విమర్శించడం.. అభిప్రాయం కాదు రాజద్రోహం అని రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ పై కొంతమంది రకరకాలుగా స్పందిస్తున్నారు. వార్ గురించి అడిగితే తప్పేంటి అంటూ కొందరు. దానికి రష్మీ సమాధానమ్మిస్తూ.. ఇలాంటి సెన్సిటివ్ విజయాల గురించి వివరాలు వెంటనే అందించారు.. కొన్ని సీక్రెట్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరముంటుందని మనం అర్ధం చేసుకోవాలి. మినిమమ్ ఆలోచించకుండా.. మన దేశ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది రష్మీ. రష్మిక పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.