
బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కు తెలుగు అడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. కార్తీక దీపం 2 సీరియల్ కు గట్టిపోటీనిస్తూ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సీరియల్లో మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే షర్మిత గౌడ, నైనిషా రాయ్, శ్రీప్రియ శ్రీకర్, గిరి శంకర్ కీలకపాత్రలలో నటిస్తూ తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ సిరీయల్ కోసం ప్రధాన పాత్రధారులతోపాటు మిగతా నటీనటులు సైతం భారీగానే పారితోషికాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సీరియల్లో రాజ్ కంటే ఎక్కువ కావ్యకే రెమ్యునరేషన్ వస్తున్నట్లు సమాచారం.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సీరియల్లో హీరోగా నటిస్తోన్న మానస్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.30 వేలు పారితోషికం తీసుకుంటున్నాడట. అంటే నెలలో సుమారు ఇరవై రోజుల వరకు బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ లో మానస్ పాల్గొననున్నట్లు సమాచారం. అంటే నెలకు ఈ సీరియల్ ద్వారా దాదాపు రూ.7 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. ఇక ఇందులో రాజ్ కంటే ఎక్కువ కావ్యకే పారితోషికం వస్తుందట. అంటే దీపికా రంగరాజు ఎక్కువగా తీసుకుంటుందట. దీపికా ఒక్క రోజు ఎపిసోడ్ కోసం రూ.35 వేల వరకు పారితోషికం తీసుకుంటుందట. అంటే నెలకు పది లక్షలకు పైగానే ఉంటుందట.
ఇక ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తోన్న రుద్రాణి అత్త అలియాస్ షర్మిత గౌడ సైతం రాజ్, కావ్య పాత్రలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే రెమ్యునరేషన్ విషయంలోనూ కావ్య, రాజ్ లకు గట్టిపోటీనిస్తుంది షర్మిత. తాజా సమాచారం ప్రకారం షర్మిత ఒక్క రోజు ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.20 వేలు పారితోషికం తీసుకుంటుందట. అంటే నెలకు రూ.7 లక్షలకు పైగానే సంపాదిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :