-
5 డిసెంబర్ 1992న దేశ రాజధాని ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్లో డిప్లొమా చేసింది. అలాగే ప్రముఖ కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది ఈ భామ.
-
తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తున్న ఈ బ్యూటీకి చిన్నతనం నుంచే నటన పై ఆశక్తితో గ్రాడ్యుయేషన్ తర్వాత చిత్రసీమలో అడుగుపెట్టింది. ముందుగా బుల్లితెరపై తన కెరీర్ మొదలుపెట్టింది ఈ వయ్యారి భామ.
-
2010లో సప్నోన్ సే భరే నైనా అనే ఓ హిందీ సీరియల్ లో సోనాక్షిగా టెలివిజన్ లో తన కెరీర్ని ప్రారంభించింది. ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హై సీరియల్ లో సియా అనే ప్రధాన పాత్రను పోషించింది. గుస్తాఖ్ దిల్, మహాకుంభ్: ఏక్ రహస్యా, ఏక్ కహానీ సీరియల్స్ లో నటించింది.
-
2017లో చన్నా మేరేయా అనే ఓ పంజాబి చిత్రంలో కథానాయకిగా ప్రధాన పాత్రలో సీని అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. 2018లో వీరే కి వెడ్డింగ్ అనే ఓ హిందీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ.
-
తర్వాత 2018లో ఆర్ఎక్స్100 అనే చిత్రంలో యంగ్ హీరో కార్తికేయకి జోడిగా తెలుగు చిత్రం పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తర్వాత వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో కథానాయకిగా నటించింది. 2023లో వచ్చిన మంగళవారం అనే చిత్రంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది.