Most Recent

స్పెషల్ సాంగ్స్ కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుంది వీరే.. సమంత ఎంత అందుకుందంటే

స్పెషల్ సాంగ్స్ కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుంది వీరే.. సమంత ఎంత అందుకుందంటే

సౌత్ ఇండియన్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఏ జోనర్ సినిమా అయినా సరే ఓ స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే.  సినిమాలు చాలా సార్లు ఫ్లాప్ అయినా ఆ సినిమాలోని ఐటెం సాంగ్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా సినిమాల్లో ఐటెం నంబర్లకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇంతకు ముందు కొంతమంది మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేశారు.. స్పెషల్ సాంగ్స్ కోసమే కొంతమందిని తీసుకునే వారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. ఇటీవల టాప్ హీరోయిన్ కూడా ఈ తరహా పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఐటెం సాంగ్స్ చేయడానికి హీరో కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు.

మలైకా నుండి సన్నీలియోన్ వరకు చాలా మంది సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. 4 నుంచి 5 నిమిషాల పాటకు కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కేవలం 5 నిమిషాల డ్యాన్స్‌కి ఇండియన్ సినిమాలో అత్యధికంగా 5 కోట్ల వరకు అందుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద రెమ్యునరేషన్.

ఐటెం సాంగ్స్‌లో నటించి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా  మంది ఉన్నారు. వారిలో మలైకా అరోరా ఒకరు. ఒక్కో పాటకు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలు అందుకుంది ఈ బ్యూటీ. కరీనా కపూర్ ఐటెమ్ డ్యాన్స్ కోసం 1.5 కోట్లు తీసుకుంది. మిల్కి బ్యూటీ తమన్నా భాటియా ఒక పాట కోసం రూ. 1 కోటి అందుకుంది. కత్రినా కైఫ్ ప్రత్యేక పాటలో కనిపించినందుకు 2 కోట్లు తీసుకుంది. బాలీవుడ్‌లో అత్యంత రెమ్యునరేషన్ అందుకున్నవారిలో సన్నీ లియోన్ ఒకరు. ఒక్కో పాటకు రూ.2-3 కోట్లు తీసుకుంది ఈ చిన్నది. వాళ్ళందరిని బీట్ చేసింది సమంత . అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలోని  ‘ఉ అంటేయ్యా మావా..’ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పాట కోసం సమంత 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమంత తన కెరీర్‌లో తొలి స్పెషల్ ఐటెం సాంగ్‌ ఇది. ఐదు నిమిషాల పాటు కనిపించిన ఆ పాట సూపర్ హిట్ అయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.