న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో రాబోతున్న ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని కూతురిగా కియారా ఖన్నా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా నాని ఇండియా టుడే తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ అవార్డ్స్ గురించి.. జై భీమ్ ట్వీట్ వివాదంపై స్పందించారు. జాతీయ అవార్డ్స్ గురించి నాని చేసిన వ్యాఖ్యలను తప్పుగా తీసుకున్నారని.. అసలు నేనెప్పుడు ఆ మాట చెప్పలేదని తెలిపారు నాని.
నాని మాట్లాడుతూ.. “జాతీయ అవార్డులు తెలుగు సినిమాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నాను. అందులోనూ ‘RRR’, ‘పుష్ప’ సినిమాలకు అవార్డ్స్ వచ్చాయి. అలాగే నా సోదరుడు బన్నీ (అల్లు అర్జున్)కి తన మొదటి జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇది మేము గెలుచుకున్న అత్యధిక జాతీయ అవార్డులు అందుకు నేను చాలా సంతోషించాను. అందుకు నేను ఒక పోస్ట్ పెట్టాను. నేను ‘జై భీమ్’ చూసినప్పుడు, నేను చూసిన ఉత్తమ చిత్రాలలో ఇది ఒకటి అని ట్వీట్ చేసాను. ఏ కేటగిరీలో అయినా అవార్డు రానప్పుడు సినిమా కనీసం కొంత కేటగిరీకి అయినా దక్కాలి అనిపించింది. అందుకే హార్డ్ బ్రేక్ ఎమోజీని షేర్ చేశాను.
View this post on Instagram
కానీ నా వ్యాఖ్యలను కొందరు తప్పుగా రాశారు. ఉదాహరణకు మా చెల్లి ఒక ఘనత సాధించి పక్కింటి నా కజిన్ ఏమి సాధించలేకపోతే.. నా చెల్లి కోసం సంతోషం వ్యక్తం చేస్తాను. నా కజిన్ కోసం బాధపడతాను. అలాగే జైభీమ్ సినిమా పట్ల ట్వీట్ చేశాను. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి దక్కిన అవార్డులతో సంతోషంగా లేరని.. అసంతృప్తిగా ఉన్నారని రాశారు. అసలు నేను ఎప్పుడు ఆ మాట చెప్పాను. కానీ జైభీమ్ సినిమాకు అవార్డ్ వచ్చి ఉంటే ఆ చిత్రనిర్మాతలు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి మరింత ప్రోత్సాహకరంగా ఉండేదనేది నా భావన ” అంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.