Most Recent

ShahRukh Khan: షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్.. భద్రత పెంచిన ప్రభుత్వం

ShahRukh Khan: షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్.. భద్రత పెంచిన ప్రభుత్వం

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పఠాన్, జవాన్ చిత్రాలు విజయం సాధించిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని షారుఖ్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో షారుఖ్ ఖాన్ కు భద్రత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం షారుక్ భద్రతను వై+గా మార్చారు. షారుఖ్ ఖాన్ లిఖిత పూర్వక ఫిర్యాదుతో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు షారుఖ్ కు విఐపి భద్రతను ఇవ్వాలని నిర్ణయించారు. షారుఖ్ ఖాన్ కు ఈ సెక్యూరిటీ కోసం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

షారుక్ ఖాన్‌ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన జవాన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు వసూల్ చేసింది. ఇక రీసెంట్ గా జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుక్. అట్లీ డైరెక్షన్ లో వచ్చిన జవాన్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా రికార్డులను సృష్టించాయి. ఈ రెండు సినిమాల విజయం తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని షారుక్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

పఠాన్ 25 జనవరి 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1050 కోట్ల రూపాయలను రాబట్టింది. అతని రెండో సినిమా జవాన్ కూడా పఠాన్ రికార్డును బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జవాన్ ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత, షారుక్‌ డంకి అనే సినిమా చేస్తున్నాడు.  డిసెంబర్ నెలలోఈ సినిమా విడుదల కానుంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

షారుఖ్ ఖాన్ ట్విట్టర్

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.