టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొంటుంది. దర్శకుడిగా మారకముందు రచయితగా పలు సినిమాలకు పని చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దర్శకుడిగా అద్భుత మైన సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తప్ప అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఇతర దర్శకుల సినిమాలకు స్క్రీన్ ప్లే కూడా అందిస్తూ ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే.. అలాగే ఇప్పుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తోన్న బ్రో సినిమాకు కూడా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ లో తెరకెక్కిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ తో పాటు మైడియర్ మార్కండేయ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ కోసం రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని టాక్. హీరోలకు సరిసమానంగా త్రివిక్రమ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..