తమిళ్ స్థార్ హీరోల్లో ముందు వరసలో ఉండే హీరో దళపతి విజయ్. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా దళపతి విజయ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. దళపతి సినిమా అంటే మినిమమ్ ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ఆయన సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంటాయి. సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఇప్పుడు రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు. గతంలో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాగే ఇప్పుడు పాదయాత్ర చేయబోతున్నారని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దళపతి విజయ్ కు పోలీసులు జరిమానా విధించారు.
తాజాగా విజయ్ అభిమానులను కలిశారు. తన రాజకీయ ప్రవేశం గురించి.. అలాగే పాదయాత్ర గురించి ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన తిరిగి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన కారును ఫాలో చేశారు. సుఖాలు వేసుకుంటూ.. నిందలు చేసుకుంటూ విజయ్ కారును ఫాలో చేశారు.
వారి నుంచి తప్పించుకునేందుకు విజయ్ రెండు చోట్ల సింగ్నల్ ను జంప్ చేశారని తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ పడ్డా కూడా కారును ఆపకుండా వెళ్లడంతో విజయ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారని తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక విజయ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ తో కలిసి లియో అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేశారు విజయ్. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.