తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం చిత్రం ‘తంళన్’. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విక్రమ్ ఫస్ట్ లుక్తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా విక్రమ్ సరికొత్త లుక్లో ఆకట్టుకుంటున్నారు. కోలార్ బంగారు గనుల్లో జరిగిన కొన్ని నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోనే హీరోయిన్గా మాళవిక మోహనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు సాధించడమే లక్ష్యంగా చిత్ర యూనిట్ అడుగులు వేస్తోంది. ఆస్కార్తో సహా మరికొన్ని అంతర్జాతీయ అవార్డులు దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకడగు వేయకుండా అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయమై తాజాగా నీలం ప్రొడక్షన్ హౌస్ సీఈఓ ధనంజయన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
తంగళన్ మూవీని ఆస్కార్కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. యూనివర్సల్ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కేవలం మరో 10 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇదిలా ఉంటే తంగళన్ మూవీని 2024లో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో తంగళన్ మూవీని ఫిలిం ఫెస్టివల్స్లో స్క్రీనింగ్ చేయనున్నారు. ఆస్కార్ రేసులో ఈ మూవీ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. 2డీతో పాటు 3డీ వెర్షన్లోనూ విడుదల చేయనున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..