పవర్ స్థార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో దుసుచూస్తున్నారు. ఇప్పటికే వరుస సినిమాలను లైనప్ చేసిన పవన్ ఆయన సినిమాల షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్. గ్యాప్ లో సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు పవన్. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ కు చెందిన పలువురు ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కూడా చకచకా జరుగుతుందో. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. అలాగే ఓజీ, బ్రో సినిమాలతోనూ రానున్నాడు పవన్.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సరసన నటించే అందుకుందట ఓ యంగ్ బ్యూటీ. ఐశ్వర్య మీనన్.. స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు పదేళ్లవుతోంది.అయినా కూడా ఈ అమ్మడు తమిళ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ వచ్చింది.
ఇక ఇప్పుడు స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ బంపర్ ఆఫర్ అందుకుందని తెలుస్తోంది. పవర్ స్టార్ నటిస్తున్న సినిమాలో ఐశ్వర్య ఛాన్స్ దక్కించుకుందట. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో వస్తోన్న ఓజీ సినిమాలో చాలా మంది నటులు ఉన్నారట. వారిలో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరి టాక్. ఈ సినిమాలో కీలక పాత్రలో ఐశ్వర్య మీనన్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.