హీరోయిన్ అంటే నటనతో పాటు అందం పైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే నటన తో పాటు ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడుతూ ఉంటారు. బొద్దుగా ముద్దుగా ఉన్న బ్యూటీలు.. సన్నజాలుగా మారాలని జిమ్ లో తెగ కష్టపడుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ సినిమాలకోసం బొద్దుగా మారుతారు. అలాగే సన్నగాను మారిపోతుంటారు.. ఇప్పుడు అదే ఈ అమ్మడిని ట్రోల్స్ కు గురయ్యేలా చేసింది. ఆ బ్యూటీ ఎవరో కాదు కీర్తిసురేష్. నేను శైలజ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కీర్తిసురేష్. ఆతర్వాత వచ్చిన మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవర్స్ ను సొంతం చేసుకుంది. మహానటి సినిమాలో దివంగత హీరోయిన్ సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ భామ.
ఇక ఈ చిన్నది రీసెంట్ డేస్ లో గ్లామర్ డోస్ ను పెంచేసింది. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను కవ్వించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తన అందంతో ఆకట్టుకుంటుంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ దసరా సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే కీర్తిసురేష్ ఒకానొక సమయంలో ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంది. కెరీర్ ఆరంభంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలో సన్నగా మారిపోయింది ఈ అమ్మడు. దాంతో ఆసమయంలో అనేక నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంది. కీర్తిసురేష్ అందం పోయిందని.. ఆమె సినిమా సినిమాలకు పనికిరాదు అన్న వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది కీర్తిసురేష్