చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ కృతిశెట్టి. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ మంగుళూరు బ్యూటీ. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఉప్పెన సినిమా సక్సెస్ తర్వాత ఈ అమ్మడికి వరుస సినిమాలు క్యూ కట్టాయి. ఉప్పెన సినిమా తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా హిట్ అయ్యింది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి తో పాటు సాయి పల్లవి కూడా నటించింది. ఆ తర్వాత అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో నటించింది. ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ఇలా ఈ అమ్మడు చేసిన మూడు సినిమాలు హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
అయితే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పుతుందని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీకి బ్యాడ్ లక్ ఎదురైంది. శృతి శెట్టి చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. చివరిగా వచ్చిన నాగ చైతన్య కస్టడీ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడిని ఓ స్థార్ హీరో కొడుకు వేదిస్తున్నాడట. అతను ఎక్కడికి వెళ్తే తనను అక్కడికి రమ్మని ఫోన్ చేసి విసిగిస్తున్నాడట. ఇటీవల అతడి పుట్టిన రోజు న షూటింగ్ వదిలేసి రావాలని ఫోన్ చేసి విసిగించాడట. అతను తనను ఇబ్బందిపెడుతున్నడని.. పదే పదే ఫోన్ చేసి వేధిస్తున్నాడని తెలిపింది కృతి శెట్టి.