-
ప్రస్తుతం తెలంగాణలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రముఖ ఆలయాళ్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
-
తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్నిదర్శించుకుంది. తన లేటెస్ట్ సినిమా పరదా చిత్ర బృందంతో కలిసి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది.
-
ఈ సందర్భంగా ఆలయాధికారులు అనుపమకు ఘన స్వాగతం పలికి ఆశీర్వాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా అవుతున్నాయి.
-
అనుపమ ప్రధాన పాత్రలో నటించిన పరదా సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఇటీవల సెకెండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
-
ఈ క్రమంలోనే అనుపమ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించింది. 'సినిమా బండి' తో ఆకట్టుకున్న ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
-
పరదా సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు నటి సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికీ రిలీజైన టీజర్,సాంగ్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.