
మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు ఇప్పుడు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఓ సినిమా గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రంలోని క్లైమాక్స్ మిమ్మల్ని షాక్ కు గురిచేస్తుంది. ఈ సినిమాలో హీరోగా భావించే వ్యక్తి నిజమైన విలన్గా మారతాడు. మనం మాట్లాడుతున్న సినిమా మరెవరో కాదు ‘దేవా’. 2025 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఒక మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఇందులో షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు, అలాగే పూజా హెగ్డే కథానాయికగా కనిపించింది. ఆయనతో పాటు, పావైల్ గులాటి, కుబ్రా సైట్, ప్రవేశ్ రాణా వంటి తారలు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ పోలీస్ ఆఫీసర్ దేవ్ పాత్రను పోషించారు.
ఇక ఈ సినిమా కథ మొత్తం దేవ్ చుట్టూ తిరుగుతుంది. అతను ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. పని విషయంలో అతను ఎవరి మాట వినడు. అతిపెద్ద గూండాలు, నేరస్థులు కూడా దేవ్ కి భయపడతారు. ఈ చిత్రంలో పావైల్ గులాటి ACP రోహన్ డి’సిల్వా పాత్రను పోషించారు. అయితే దేవా, రోహన్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. పోలీసుల కోసం నిర్వహించిన ఓ వేడుకలో రోహన్ హత్యకు గురవుతాడు. దీంతో కథ మలుపు తిరుగుతుంది. రోహన్ హత్య కేసును దర్యాప్తు ప్రారంభించి, హంతకుడిని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు దేవా. అప్పుడే ఓ ప్రమాదంలో చిక్కుకుని జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో సినిమా కథ మొత్తం తలక్రిందులవుతుంది.
సినిమా చివరి వరకు విలన్ ఎవరనేది అర్థం కాదు. కానీ క్లైమాక్స్లో ఎవరూ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఈ చిత్రంలో మరోసారి అద్భుతమైన నటనతో జనాలను మెప్పించారు షాహిద్ కపూర్. ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. రూ. 60 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 56.12 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ప్లిక్స్ ఓటీటీలో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..