
మీరు థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారా.. ? క్షణ క్షణం ఉత్కంఠ.. మీరు ఊహించని మలుపులతో సాగుతుంది. ఇక క్లైమాక్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా చూస్తూ.. ఆకర్షణీయమైన కథాంశం, మీరు చూడని మలుపుల కారణంగా మీరు కొంత గందరగోళానికి గురవుతారు. ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా గురించి తెలుసా.. ? దాదాపు 2 గంటల 8 నిమిషాలు ఉండే ఈ సినిమా 2017లో విడుదలైంది. భయం, ఉత్కంఠ, అతీంద్రియ అంశాలను మిళితం చేసిన ఈ మూవీ ప్రేక్షకుడికి భయం కలిగిస్తూనే అనుక్షణం ఊహించని మలుపులతో ఆసక్తిని కలిగిస్తుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ? అదే 706. డైరెక్టర్ శ్రావణ్ తివారీ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ మధ్యలో ఒక మర్మమైన పిల్లవాడిగా యశ్విత్ సాంచెటి, మానసిక వైద్యుడిగా దివ్య దత్తా, పోలీసు అధికారికగా అతుల్ కులకర్ణి, ఆధ్యాత్మిక గురువుగా మోహన్ అగాషే నటించారు.
కథ విషయానికి వస్తే.. డాక్టర్ సుమన్ (దివ్య దత్తా పోషించిన పాత్ర) చుట్టూ తిరుగుతుంది. అదృశ్యమైన తన భర్త కోసం అవిశ్రాంతంగా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక ఆసుపత్రిలో మానసికంగా అస్థిరంగా ఉన్న ఒక అబ్బాయిని కలుస్తుంది. అతడు చెప్పిన నిజాలు విని షాకవుతుంది. అందులో ఒకటి ఆమె భర్త చనిపోయాడని. అలాగే ఆమెను కలవరపెట్టే రహస్యాలు గురించి తెలుసుకుంటుంది.ఆ తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకులలో కలుగుతుంది. ఈ సినిమాకు IMDbలో 10కి 5.3 రేటింగ్ కలిగి ఉంది.
కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా అంతకు రెండింతలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. థియేటర్లలో ఈ సినిమా రూ.10 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఈ చిత్రాని యూట్యూబ్ లో ఉచితంగా చూడొచ్చు.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..