
స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ స్టార్ హీరో. ధనుష్ చాలా వేగంగా సినిమాలు చేస్తుంటాడు. తెలుగు, తమిళ్, హిందీ బాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కుబేర అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా కుబేర సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. కుబేర సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డీఎస్పీ సంగీతంలో ధనుష్ తొలిసారిగా కుబేర చిత్రంలో ఓ పాట పాడడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. నటుడు ధనుష్ దర్శకత్వం వహించి, నటించి, ఈ సంవత్సరం విడుదలైన రాయన్ చిత్రం ప్రజల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా విజయం తర్వాత ధనుష్ నటిస్తున్న సినిమా కావడంతో కుబేర సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ ట్రైలర్ లో ధనుష్, రష్మిక తమ నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కింగ్ నాగార్జున మాత్రం కుమ్మేశారు. సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని అర్ధమవుతుంది. ధనుష్ బిచ్చగాడిలా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఒక బిచ్చగాడు ఓ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నేపథ్యం.. అతని కోసం విలన్స్ వెతకడం చాలా ఆసక్తిగా అనిపించింది. అలాగే ఓ ధనికుడు ప్రపంచాన్ని, ఓ పేదవాడి ప్రపంచాన్ని ఎలా కలిపారు అనేది చూడాలంటే కుబేర సినిమాకు వెళ్లాల్సిందే.. ఇక ఈ సినిమాను జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి