
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఇషితా దత్తా. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో జనాల హృదయాలను దోచుకుంది. యంగ్ హీరో తనీష్ నటించిన చాణక్యుడు మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ హిందీలో మాత్రం అనేక సినిమాల్లో కనిపించింది. కేవలం సినిమాలే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ సైతం చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. వీరిద్దరు కలిసి 2016లో రిష్టన్ కా సౌదాగర్-బాజిగర్ అనే సీరియల్ చేశారు. ఆ సమయంలోనే తన తోటి నటుడు వత్సల్ సేథ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2023లో బాబు జన్మించారు. ఇక ఇషితా మరోసారి తల్లైంది. తమకు మహాలక్ష్మీ పుట్టిందంటూ ఈ జంట సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
“మేము ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం. ఇప్పుడు మా ఫ్యామిలీ సంపూర్ణమైంది. నాకు కూతురు పుట్టింది” అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వత్సల్ మాట్లాడుతూ.. “తల్లిదండ్రులుగా, మా కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మేము నిర్ణయించుకున్నాము. నేను నా కొడుకు, నా భార్యను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ ఇద్దరి పట్ల నా నుంచి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ” అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 14 ఏళ్లకే ఇండస్ట్రీని రూల్ చేసింది.. 16 ఏళ్లకే జాతీయ అవార్డ్.. 21 ఏళ్ల వయసులోనే ఊహించని మరణం..
Mehreen Pirzadaa: ఎఫ్ 2 మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా అయ్యిందో చూడండి..
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇషితా దృశ్యం సినిమాతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. అజయ్ దేవగణ్, శ్రియా కలిసి నటించిన ఈ చిత్రంలో ఇషితా కీలకపాత్ర పోషించింది. ఇందులో టబు సైతం ముఖ్య పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. దృశ్యం 3లోనూ ఇషితా నటించనున్నట్లు సమాచారం.
ఇషితా దత్తా ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..