
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో నాగార్జునతో కలిసి కుబేర చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటీ కలిగిస్తోంది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ధనుష్ తన కొడుకు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలలో పాల్గొన్నాడు. కొడుకు సక్సె్స్ చూసి పొంగిపోతున్న ధనుష్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ధనుష్ కుమారుడు యాత్ర తన పాఠశాల విద్యను పూర్తిచేశాడు. తాజాగా పాఠశాలలో జరిగిన స్నాతకోత్సవానికి తన మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కొడుకును కౌగిలించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసి ప్రౌడ్ పేరెంట్స్ అంటూ రాసుకొచ్చారు. విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత తమ కొడుకు గ్రాడ్యుయేషన్ వేడుకలలో ఐశ్వర్య, ధనుష్ ఇద్దరూ సంతోషంగా కనిపించడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ధనుష్ దర్శకత్వం వహించి .. నటించిన ఇడ్లీ కడై చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా తేరే ఇష్క్ మై లో నటిస్తున్నరాు. ఆతర్వాత అమరన్ డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించే ఒక చిత్రంలో, లాప్పర్ బంధు దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించే ప్రాజెక్టులో నటించనున్నారు. ఇవే కాకుండా డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించనున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ లో నటించనున్నారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..