Most Recent

Tamannaah Bhatia: తమన్నా పై సీరియస్ అవుతున్న కన్నడ ప్రజలు.. కారణం ఏంటంటే

Tamannaah Bhatia: తమన్నా పై సీరియస్ అవుతున్న కన్నడ ప్రజలు.. కారణం ఏంటంటే

మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్యకాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. తెలుగులో రీసెంట్ గా ఓదెల 2 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తమన్నా అఘోర పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అదరగొడుతుంది. తెలుగులో కంటేహిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు పలు యాడ్స్ షూట్ లోనూ నటిస్తుంది. ఇలా రెండు చేతులా సంపాదిస్తుంది. అయితే ఇప్పుడు ఈ చిన్నది ఊహించని చిక్కుల్లో పడింది. తమన్నా పై కన్నడ ప్రేక్షకులు సీరియస్ అవుతున్నారు. తమన్నా వద్దు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇందుకు కారణం ఏంటంటే..

తమన్నాను రీసెంట్ గా మైసూర్ శాండల్‌ సోప్ తో డీల్ చేసుకుంది. కర్ణాటక ప్రభుత్వం తమన్నాను మైసూర్ శాండల్‌ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ మైసూర్ శాండల్‌ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాను ఎంపిక చేసింది. అయితే ఈ డీల్ ఇప్పుడు తమన్నాను చిక్కుల్లో పడేసింది. కర్ణాటక బ్రాండ్‌గా ఉన్న మైసూర్ శాండల్ కు తమన్నాను ఎందుకు ఎంపిక చేశారు అంటూ కన్నడిగులు ప్రశ్నిస్తున్నారు.

మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ కు తమన్నాను నియమించడం పై వస్తున్న విమర్శల పై కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ రియాక్ట్‌ అయ్యారు. పాన్-ఇండియా సెలబ్రిటీ అయితే మైసూర్ శాండల్‌ సోప్ విస్తరణను భారీగా పెంచొచ్చు అని అన్నారు. ఇక ఈ డీల్ కోసం తమన్నా ఏకంగా రూ. 6.2 కోట్లు అందుకుంటుందని తెలుస్తుంది. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న మైసూరు శాండల్ స‌బ్బుల‌తో పాటు ఇతర ఉత్పత్తులకు తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారికంగా నియమించారు. కన్నడలో స్టార్స్ ఉండగా తమన్నా ఎందుకు అంటూ కన్నడిగులు సీరియస్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.