బాహుబలి.. ఈ సినిమా సృష్టించిన సంచనలం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా స్థాయిని, ఆ మాటకొస్తే ఇండియన్ సినిమా స్థాయిని ఒకేసారి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందీ మూవీ. రాజమౌళి అద్భుత దర్శకత్వం, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యదేవ్ల నటనతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్టర్లా నిలిచింది.
బాహుబలి రెండో పార్ట్ అయితే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ బాహుబలి, నాన్ బాహబలి రికార్డ్స్ అనే స్థాయికి చేరిందీ మూవీ. కాగా ఇటీవల ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ దర్శకుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాజమౌళి బాహబలికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమా ఆలోచన వచ్చిన వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్లిన రాజమౌళి.. డార్లింగ్ నీతో ఒక పెద్ద సినిమా చేయాలనుకుంటున్నాను. రాజుల కథలో ఉంటుంది. బాహుబలి అనే వీరుడు, యుద్ధానికి వెళ్లినప్పుడు ఒక్క గాయం లేకుం తిరిగి వస్తాడు అని కథ చెప్పడంతో ప్రభాస్ వెంటనే సినిమాకు ఓకే చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉండడంతో మొదట ఇందుకోసం హాలీవుడ్ నటుడు జేసన్ మమోవాను అనుకున్నారంటా.. ఆక్వామెన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న జేసన్ అయితే సినిమాకు ప్లస్ అవుతారని చిత్ర యూనిట్ భావించింది.
అయితే తెలుగులో ప్రభాస్కు తగిన హైట్, వెయిట్ కలిగిన వ్యక్తుల్లో రానా కూడా ఒకరు. దీంతో నిర్మాత శోభు యార్లగడ్డ రానాను కలిసి బాహుబలి కథ గురించి తెలిపారు. దీంతో రానా బదులిస్తూ.. నాకంటే ముందు ఈ పాత్ర కోసం ఎవరిని అనుకున్నారని ప్రశ్నించగా.. హాలీవుడ్ సేజన్ మమోవాను అనుకున్నామని శోభు చెప్పడంతో. రానా నవ్వేసి భళ్లాల దేవుడి పాత్రలో నటించేందుకు వెంటనే ఒప్పుకున్నాడు. ఇలాటి మరెన్నో ఆసక్తికర విషయాలను దర్శకుడు రాజమౌళి ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..