ఇంట్లో టీవీలున్నా, ఓటీటీలు వచ్చినా సినిమాను బాగా ఎంజాయ్ చేయాలంటే థియేటర్లకు వెళ్లా చూడాల్సిందే. ప్రేక్షకుల ఈలలు, కేకల మధ్య బిగ్ స్క్రీన్పైనే సినిమాను చూస్తేనే అసలు మజా వస్తుందనేది చాలామంది అభిప్రాయం. ఈ కారనంగానే ప్రతి శుక్రవారం థియేటర్లు కళకళలాడుతుంటాయి. అయితే సగటు ప్రేక్షకుల్లా సెలబ్రిటీలు థియేటర్లలోకి వచ్చి సినిమాను ఆస్వాదించలేరు. ముఖ్యంగా సినిమా తారలు థియేటర్లకు రావాలంటే ఎన్నో ఆంక్షలు, ఇబ్బందులుంటాయి. ఈ నేపథ్యంలోనే ఒక టాలీవుడ్ హీరో ఎవరూ తనను గుర్తుపట్టకుండా బుర్ఖాను ధరించి సినిమా థియేటర్కు వెళ్లాడు. ప్రేక్షకుల మధ్య తను నటించిన సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేశాడు. తన మూవీ పట్ల ఆడియెన్స్ స్పందనను కూడా తెలుసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మరి బుర్ఖాలో ఉన్న ఈ హీరోను మీరు కనిపెట్టారా? కొంచెం కష్టంగా ఉంది కదా.. అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. అతను మరెవరో కాదు ట్యాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. తన లేటేస్ట్ సినిమా మామా మశ్చీంద్రాకు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇలా బుర్ఖాలో థియేటర్కు వెళ్లాడీ హీరో.
ఇక మామా మశ్చీంద్ర సినిమా విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ రోల్లో కనిపించారు సుధీర్ బాబు. ఇప్పటివరకు కమెడియన్గానే మనకు తెలిసిన హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. రాజీవ్ కనకాల, అభినయ, అజయ్ కీలకపాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్రావు మామా మశ్చీంద్ర సినిమాను నిర్మించారు. శుక్రవారం (అక్టోబర్ 6) విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సుధీర్ బాబు నటన బాగుందంటూ ప్రశంసలు వస్తున్నాయి.
థియేటర్ లో బుర్ఖాతో హీరో సుధీర్ బాబు..
View this post on Instagram
మామా మశ్చీంద్ర సినిమాకు పాజిటివ్ టాక్..
View this post on Instagram
మామా మశ్చీంద్ర కోసం సుధీర్ ఎంతలా కష్టపడ్డాడో చూశారా?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.