కళ్లతో మాయ చేస్తూ ఓర చూపులు చూస్తోన్న ఈ టాలీవుడ్ హీరోయిన్ను గుర్తుపట్టారా? ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు వారికి కూడా పరిచయమే. పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులే తెచ్చుకుంది. అయితే అదృష్టమే కలిసి రావట్లేదు. ఇప్పటివరకు ఎక్కువగా సెకెండ్ హీరోయిన్గానే నటించిన ఈ ముద్దుగుమ్మ మెయిన్ లీడ్లో నటించేందుకు మరికొంత కాలం పడుతుందేమో. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మకు బోలెడు క్రేజ్ ఉంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్తో కుర్రకారు మతి చెడగొడుతోంది. అలా ఈ సొగసరి షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇందులోముఖం కనిపించుకుండా కేవలం కళ్లతోనే మాయ చేస్తూ కనిపించిందీ ముద్దుగుమ్మ. మరీ ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ఈ బ్యూటీ ఓ సినిమాలో అక్కినేని అందగాడు నాగచైతన్యతో ఆడిపాడింది. అంతేకాదు ఆ మూవీ ఈవెంట్లో చైతన్యకు కొంటె సైగలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. అలాగే ఓ సినిమాలో రవితేజతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. మరి ఇప్పుడైనా కనిపెట్టారా?లేదా? మమ్మల్నే చెప్పేయమంటారా? ఈ సొగసరి మరెవరో కాదు.. బంగార్రాజు సినిమాలో ‘ఎంత సక్కగుందిరో’ అంటూ నాగచైతన్యతో సందడి చేసిన దక్షా నాగర్కర్.
సుమారు పదేళ్ల క్రితం ఏకే రావు పీకే రావు అనే సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దక్ష నగార్కర్. ఆ తర్వాత ‘హోరాహోరీ’ ‘హుషారు’ లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే జాంబి రెడ్డి సినిమాలో మ్యాగీ పాత్రతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. అలాగే ఈ సినిమా ఈవెంట్లో నాగ చైతన్యకు కొంటె సైగలు చేసి హాట్ టాపిక్గా నిలిచింది. దీని తర్వాత రవితేజ రావణాసుర సినిమాలో నటించింది. ఆపై సిల్వర్ స్క్రీన్పై కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. తన బ్యూటిఫుల్ అండ్ హాట్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తోంది. పై ఫొటో కూడా అందులోదే.
దక్షా నగార్కర్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ట్రెడిషినల్ లుక్ లో దక్ష..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.