బిగ్ బాస్ సీజన్ 7 లో పవర్ అస్త్ర అంటూ ఓ కొత్తగా ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. హౌస్ లో ఉన్నవారికి పవర్ అస్త్ర పేరుతో ఇమ్యూనిటీ ఇవ్వడంతో పాటు హౌస్ లో కంటెస్టెంట్ గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఇస్తున్నారు బిగ్ బాస్. ఈ ప్రక్రియలో ముందుగా హౌస్ లోకి వెళ్లిన పద్నాలుగు మందిలో సందీప్ టాస్క్ ల్లో విజయం సాధించి మొదటి పవర్ అస్త్రను దక్కించుకున్నాడు. దాంతో సందీప్ కు ఐదు వారల ఇమ్యూనిటీ వచ్చింది. అలాగే ఎలిమినేషన్ నామినేషన్ కూడా ఉండదు. ఆతర్వాత హీరో శివాజీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లతో పాటు తన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను మెప్పించాడు. హౌస్ మేట్స్ కూడా శివాజీ ఆటకు ఫిదా అవ్వడంతో రెండో పవర్ అస్త్ర శివాజీకి దక్కింది. దాంతో బిగ్ బాస్ రెండో పవర్ అస్త్ర ను సొంతం చేసుకున్నారు శివాజీ. దాంతో నాలుగు వారల ఇమ్యూనిటీని సొంత చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు మూడో పవర్ అస్త్రను సొంతం చేసుకుంది ఎవరు అన్నది నిన్నటి ఎపిసోడ్ లో అనౌన్స్ చేశారు నాగార్జున. మూడో పవర్ అస్త్ర కోసం కంటెండర్స్ గా ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంకా జైన్ ఉన్నారు. వీరిలో ఎవరు మూడో పవర్ అస్త్ర దక్కించుకోవడానికిచెప్పమని అన్నారు. దాంతో కలిసి యావర్ పేరు చెప్పారు. దాంతో మనోడు ఘోరంగా అప్సెట్ అయ్యాడు. ఎక్కి ఎక్కి ఏడ్చాడు.
ఇక మిగిలిన ప్రియాంకా, శోభ శెట్టి మధ్య టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బుల్ రైడ్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఎవరు ఎక్కువ సేపు ఎద్దు పై ఉంటే వారేవిన్నర్ అని తెలిపాడు. దాంతో ఇద్దరు భామలు గట్టిగానే పోటీపడ్డారు. అయితే వీరిలో ఎవరు విన్నర్ అనేది నాగార్జున అనౌన్స్ చేస్తారు అని చెప్పాడు బిగ్ బాస్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగ్. విన్నర్ ఎవరో అనౌన్స్ చేశారు. ముందుగా హౌస్ లో అమర్ డీప్ ను ఎవురు విన్నర్ అని అడిగాడు నాగ్. దానికి ప్రియాంక అనుకుంటున్నా సార్ అని సమాధానం ఇచ్చాడు. ఆతర్వాత సందీప్ ను ఎవరు విన్నర్ అనుకుంటున్నావు అని అడగ్గా.. ప్రియాంకా పేరు చెప్పాడు. శివాజీని కూడా అదే ప్రశ్న అడగ్గా ఏమో బాబుగారు నేను అంతగా పట్టించుకోలేదు అని సమాధానం ఇచ్చాడు. చివరకు శోభా శెట్టి విన్నర్ అని అనౌన్స్ చేశారు నాగ్. టాస్క్ లో 12 సెకన్ల తేడాతో శోభా శెట్టి మూడో హౌస్ మేట్ గా నిలిచింది. ప్రియాంక చేతుల మీదుగా నాగార్జున శోభాకు మూడో అవర్ అస్త్ర ను ఇప్పించారు. దాంతో శోభా శెట్టి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.