Most Recent

Guntur Karam: మళళ బరలక దగన గటర కర చతర బద.. పటటలకకన చతరకరణ

Guntur Karam: మళ్ళీ బరిలోకి దిగిన ‘గుంటూరు కారం’ చిత్ర బృందం.. పట్టాలెక్కిన చిత్రీకరణ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ‘గుంటూరు కారం’ మువీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్న మువీ ఇది. ఈ మువీలో మహేష్‌ సరసన శ్రీలీల అలరించనుంది. మరో కథానాయికగా పూజా హెగ్డేను చిత్రబృందం ప్రకటించినప్పటికీ.. ఈ మధ్య పూజాహెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ స్థానంలో మరొక కథానాయిక ఎవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇక తాజాగా వచ్చిన ఫస్ట్‌ గ్లింప్స్‌తో ఈ మువీపై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్‌ తొలి వారం వరకూ చిత్రీకరణ చేసుకున్న ఈ సినిమా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పట్టాలెక్కింది. చిత్రీకరణకు చిత్ర బృందం మళ్లీ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ శివార్లలో శనివారం కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలైంది. కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

కాగా మహేశ్‌కి ‘గుంటూరు కారం’ 28వ సినిమా. మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఐతే ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమైనప్పటి నుంచి పలు అవాంతరాలు ఎదురయ్యాయి. కొన్ని నెలల విరామం తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. మహేష్‌ 29వ చిత్రం అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ మువీకి స్క్రిప్ట్‌ రాస్తున్నారు. యాక్షన్‌ డ్రామాగా జక్కన్న ఈ మువీని రూపొందిస్తున్నట్లు టాక్‌.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.